ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నిర్ణయానికి సీఎం జగన్ వ్యతిరేకం: విజయసాయి రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 10, 2021, 12:11 PM

విశాఖలోని స్టీల్ ప్లాంట్ ను మూడు దశల్లో ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధం కావడంతో కార్మికులు రోడ్డెక్కారు. పోరాటం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నామని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలనే నిర్ణయంపై వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దారుణమని అన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ కూడా వ్యతిరేకిస్తున్నారని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
క‌ర్మాగారం స‌మీపంలో కార్మికులు బుధవారం బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. దీనికి వైసీపీ నేత‌లు అవంతి శ్రీనివాస్‌, విజ‌య‌సాయిరెడ్డి, వామ‌ప‌క్ష నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హ‌క్కుల కోసం పోరాడాల్సిందేన‌ని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa