ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబుకు భయపడే పల్లా శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలించారు: దేవినేని ఉమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 16, 2021, 02:46 PM

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు భయపడే దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్‌ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారని ట్విటర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ''చంద్రబాబు పర్యటనకు భయపడే దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్‌ను పోలీసులతో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. లక్షలాది మంది కార్మికుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? మీ కేసుల మాఫీ కోసం ప్రజల ఆస్తులను అమ్మే హక్కు మీకు ఎవరిచ్చారు? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడటం లేదు?'' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa