ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అదగొట్టింది. పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించింది. ధావన్ దంచి కొట్టడంతో పంజాబ్ బౌలర్లు విలవిలలాడారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహులు (61), మయాంక్ అగర్వాల్ (69) పరుగులతో విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఢిల్లీ బౌరర్లలో క్రిస్ వోక్స్, మెరీవాలా, రబాడ, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. లక్ష చేధనకు దిగిన ఢిల్లీ ఆటగాళ్లలో ధావన్ (92), పృథ్వీ షా(32), స్టాయినీస్(27), లలిత్ యాదవ్(12) వీరవిహారం చేయడంతో 4 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే అలవోకగా లక్ష్యాన్ని చేధించింది.పంజాబ్ బౌలర్లలో జే రిచర్డ్సన్ రెండు వికెట్లు తీయగా రిలే మెరిడిత్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.కీలకమైన 17వ ఓవర్లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రెండు నోబాల్స్ వేసి, 20 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa