ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఒడిశా సీఎంతో జగన్ భేటి.. ఆ మూడు అంశాల పై చర్చా..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 08, 2021, 04:21 PM

ఏపీ సీఎం జగన్ రేపు ఒడిశా పర్యటనకు వెళుతున్నారు. భువనేశ్వర్ లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఉభయ రాష్ట్రాలకు చెందిన వివిధ అంశాలపై చర్చించనున్నారు.  ఒడిశా సీఎంతో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నారు. వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, సరిహద్దులోని కొఠియా గ్రాఆమల అంశాలను చర్చల్లో ప్రస్తావించనున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై ఈ సాయంత్రం అధికారులతో సీఎం జగన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ అంశాలకు సంబంధించి అధికారులతో సుదీర్ఘ సమయం పాటు చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa