హైదరాబాద్: టీడీపీని గెలిపించిన నంద్యాల ప్రజలకు ఎమ్మెల్యే బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల్లో ఘన విజయం సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డిని ఆయన అభినందించారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. టీడీపీకి అన్నివర్గాల మద్దతు ఉందన్న విషయం నంద్యాల ఉప ఎన్నికలతో మరోసారి స్పష్టమైంది. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని బాలకృష్ణ పిలుపునిచ్చారు. నంద్యాల ఎన్నికల కౌంటింగ్లో టీడీపీ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. మొత్తం 19 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. ఇందులో టీడీపీ మొత్తం 18 రౌండ్లలో దూసుకుపోయింది. వైసీపీ కేవళం ఒక్క 16వ రౌండ్లో మాత్రం 654 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్లో టీడీపీ- 4663, వైసీపీ-5317 ఓట్లు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa