అనంతపురం: అభ్యర్థిని ప్రకటించిన రోజే టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగిందని మంత్రి పరిటాల సునీత అన్నారు. నంద్యాలలో టీడీపీ గెలుపు వైసీపీకి చెంపపెట్టని అన్నారు. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రేపు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం సాధిస్తుందని, వైసీపీకి చెందిన ఒక్క కౌన్సిలర్ కూడా గెలవరని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో టీడీపీ గెలుస్తుందని మంత్రి సునీత ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇప్పుడే మేలుకోవాలని, ఎందుకంటే జగన్ను నమ్ముకున్న నేతలు కూడా జైలుపాలవ్వడం ఖాయమని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa