ఏపీలో ఉద్యోగ సంఘాలు పోరు బాటకు సిద్ధమయ్యాయి. పీఆర్సీపై ఉద్యోగులు నేటి నుండి నిరసనలు చేపట్టనున్నారు. దీంతో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పీఆర్సీ యుద్ధం మరింత ముదురుతోంది. ఇటీవల తిరుపతి పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం తమ డిమాండ్లు అన్ని నెరవేర్చాలని పట్టుబడుతున్నాయి. పీఆర్సీ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా నిరసనలకు దిగాలని, మంగళవారం నల్లబ్యాడ్జీలతో విధులక హాజరు కావాలని నిర్ణయించారు. కాగా తాము తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలమన్న జేఏసీ నేత బండి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చగలిగే శక్తి ఉంటే రాజకీయ పార్టీ పెట్టుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో వివాదం మరింత రసవత్తరంగా మారింది. కాగా తాము ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన నిరసనలో పాల్గొనబోమని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa