ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ స్పీడ్ పెంచింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు కింద భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ తో పాటు మరి కొందరిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా లక్ష్మీనారాయణ ఇంట్లో ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కళ్లు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఫ్యామిలీ డాక్టర్ సూచనల మేరకు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
కాగా ఈ వ్యవహారంపై టీడీపీ భగ్గుమంది. స్కిల్ లో అవినితి జరిగితే అప్పటి ఎండీ, నిర్ణయాలు తీసుకున్న ఐఏఎస్ లను ఎందుకు వదిలేశారని ఇది కక్ష్యసాధింపని టీడీపీ ఆరోపించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో రూపాయి కూడా అవినీతి జరగలేదని, డెరక్టర్ గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ కు ఏం సంబంధం.. ఆయన ఏ చెల్లింపుకైనా సంతకం పెట్టారా? ఒక్కడే ఏ నిర్ణయం అయినా తీసుకున్నారా అని టీడీపీ ప్రశ్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa