ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యక్తి అనుమానాస్పద మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 13, 2021, 01:52 PM

నెల్లూరు నగరం లోని వెంగళరావునగర్ ప్రాంతంలో నివాసముండే ఆళ్ల శ్రీనివాసులు (18) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.


శ్రీనివాసులుకు రమణి అనే మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబకలహాల నేపధ్యంలో పదేళ్ల క్రితమే భార్యాభర్తలిరువురు విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. శ్రీనివాసులు హరనాధపురం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ డాక్టర్ కు చెందిన ఇంట్లో వెంగళరావునగర్ ప్రాంతంలో ఒంటరిగి ఉంటున్నాడు.


శ్రీనివాసులు మద్యానికి బానిసైగత కొంతకాలంగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. గత రెండు రోజులుగా శ్రీనివాసులు ఆసుపత్రికి వెళ్లకపోవడంతో డాక్టర్ అతని కోసం వెంగళరావునగర్ ప్రాంతంలోని ఇంటి వద్దకు శనివారం పంపగా శ్రీనివాసులు ఇంట్లోనే మంచం మీద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు.


ఈ సమాచారం తెలుసుకున్న డాక్టర్ మృతుని సోదరుడైన రవికుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో రవికుమార్ ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.


మృతదేహం ఆనవాళ్లను బట్టి ఆ వ్యక్తి రెండు రోజుల క్రితమే మృతి చెందినట్లు దుర్వాసన వెదజల్లుతుంది. పోలీసులు మృతదేహాన్ని పంచనామ నిమిత్తం జీజీహెచ్ కు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa