ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయిల వివాహ వయస్సు పెంపు పై కేంద్రం కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 11:10 AM

భారత్‌లో 18ఏళ్లలోపు అమ్మాయిలకు పెళ్లి చేయకూడదని చట్టాలు చెబుతున్నాయి. అయితే ఈ వివాహ కనీస వయసును పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై లోతుగా అధ్యయనం చేసేందుకు సమతా పార్టీ మాజీ ఛైర్మన్ జయా జైట్లీ నేతృత్వంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపపద్యంలో తాజాగా అమ్మాయిల వివాహ వయస్సు పెంపు పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అమ్మాయిల వివాహ వయస్సు 18 సం లుగా ఉండేది, ఇపుడు కేంద్రం అమ్మాయిల వివాహ వయస్సు ను 21 సం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa