సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తన రియాలిటీ ల్యాబ్స్ (Reality Labs) విభాగంలో పనిచేస్తున్న సుమారు 1500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.మెటావర్స్పై భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ విభాగం, గత కొన్ని సంవత్సరాలుగా నిరంతర నష్టాల్లో కొనసాగుతుండటమే ఈ కీలక నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
*ఏఐ వైపు మార్క్ జుకర్బర్గ్ దృష్టి:మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఇప్పుడు తన వ్యూహాత్మక దృష్టిని మెటావర్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు మళ్లించినట్లు సమాచారం. రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ఉన్న మొత్తం 15,000 మంది ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది, అంటే సుమారు 1500 మందిని తొలగించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ప్రాజెక్టులపై పని చేస్తున్న బృందాలపై పడే అవకాశం ఉంది.
*జనవరి 14న కీలక సమావేశం:ఈ పరిణామాల నేపథ్యంలో మెటా సీటీఓ ఆండ్రూ బోస్వర్త్ జనవరి 14న ఉద్యోగులందరితో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్లో పని చేసే ఈ విభాగం ఉద్యోగులను, ఈసారి తప్పనిసరిగా ఆఫీసుకు హాజరుకావాలని సూచించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ సమావేశంలో మిగిలిన ఉద్యోగుల భవిష్యత్తు, అలాగే ఏఐ దిశగా మెటా తీసుకోబోయే తదుపరి వ్యూహాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
*భారీ నష్టాలే కారణమా? :రే-బ్యాన్ స్మార్ట్ గ్లాసెస్, క్వెస్ట్ హెడ్సెట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నప్పటికీ, రియాలిటీ ల్యాబ్స్ విభాగం ఇప్పటివరకు బిలియన్ల డాలర్ల నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో, వేగంగా లాభాలు అందించే అవకాశం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల విస్తరణ వంటి రంగాలపై మెటా పెట్టుబడులను మరింత పెంచుతున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa