ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైట్ కర్ఫ్యూలు పెట్టండి: కేంద్రం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 23, 2021, 04:29 PM

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.


రాష్ట్రాలకు కేంద్రం చేసిన సూచనలివే..


- పండగల వేళ ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టడానికి నైట్ కర్ఫ్యూలను అమలు చేయాలి. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలి.


- కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా పరిగణించాలి. ఆ ప్రాంతాల్లో తగిన నిబంధనలు అమలు చేయాలి.


- బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కు పంపించాలి.


- అన్ని జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలను ఫోకస్ చేయాలి.


- ఆసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యం, అంబులెన్స్‌, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలి.


- రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి.


- వ్యాక్సినేషన్‌ ను మరింత వేగవంతం చేయాలి. జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్‌ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి.


- రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు 100 శాతం వ్యాక్సిన్ పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa