ట్రెండింగ్
Epaper    English    தமிழ்

6 పెళ్లిళ్లు చేసుకున్న భర్త.. భార్య ఏం చేసిందంటే

national |  Suryaa Desk  | Published : Thu, Dec 23, 2021, 04:27 PM

మ్యాట్రిమోనీల్లో ప్రకటనలు ఇస్తున్న మహిళలనే టార్గెట్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్న ఓ వ్యక్తిపై అతని ఆరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.


ఓ మహిళకు దూరవాణి నగరకు చెందిన సయ్యద్‌ అహ్మద్‌ (32) అనే వ్యక్తితో 2018 నవంబరు 15న వివాహం జరిగింది. సయ్యద్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం అతనికి తాను ఆరో భార్యనని తెలిసిందని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. విడాకులు తీసుకున్న మహిళలను ఎంచుకుని వారిని తన భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిపింది.తన భర్తపై చర్యలు తీసుకోవాలని సీపీ కమల్‌పంత్‌కు ఆమె ఫిర్యాదు చేసింది. సయ్యద్‌ ఇప్పుడు మరో పెళ్లికి ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa