గుంటూరు: చిలకలూరిపేట మండలం అనంతవరం వెళ్లే రహదారిలో సోమవారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి విచారణ చేశారు. ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దేవగిరికి చెందిన అగిసాల మహేష్(32) కుటుంబంతో చిలకలూరిపేటలోని పండరీపురంలో నివసిస్తున్నాడు.
పదేళ్లుగా మురికిపూడి పరిధిలోని ఏఆర్ ఎంటర్ప్రైజెస్లోని గోదాముల్లో ఉద్యోగిగా పని చేసేవాడు. గోదాముల్లో సరకుకు పురుగు పట్టకుండా అల్యూమినియం ఫాస్పైడ్ గుళికలను వినియోగిస్తుంటాడు. ఇదిలా ఉంటే మహేష్కు ఐదేళ్ల క్రితం తేజస్వినితో వివాహం జరిగింది. వారికి ఒక పాప. ఇటీవల పాపకు సంబంధించి ఇంట్లో శుభకార్యం జరిగింది. దానికి సొంతూరు నుంచి కుటుంబ సభ్యులు వచ్చారు. ఆ సమయంలో భర్త మద్యం తాగి ఉండటాన్ని వారు వెళ్లిన తర్వాత భార్య ఆక్షేపించింది. దీంతో మనస్తాపానికి గురైన మహేష్ అనంతవరం రోడ్డు పక్కన ఓ కుంట వద్ద మద్యంలో విష గుళికలను కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa