ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలుకలు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 28, 2021, 09:36 AM

అనారోగ్యానికి గురై తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జామి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు అందించిన వివరాల ప్రకారం. జామి పట్టణానికి చెందిన నేపర్తి కోటయ్య అనే వ్యక్తి తన భార్య దేవుడమ్మతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అప్పారావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమారుడు ఈశ్వరరావు పెందుర్తిలో నివాసముంటున్నాడు.


ఇదిలావుంటే కోటయ్య ఇటీవల ప్రమాదానికి గురై తన కుడి కాలు ఆపరేషన్ చేయించుకున్నాడు. అలాగే కోటయ్య ఇతర అనారోగ్య కారణాల కారణంగా మంచంపైన ఉంటున్నాడు. మందులు వాడుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కోటయ్యను పీహెచ్సీకి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు.


మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు విజయనగరం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు వాంగ్మూలాన్ని సేకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa