ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లబ్ధి ఆగిపోతే వెరిఫికేషన్‌ చేసి ఇస్తాం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 28, 2021, 06:50 PM

లబ్ధి ఆగిపోతే వెరిఫికేషన్‌ చేసి ప్రతీ ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అందచేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల మందు కేవలం రెండు పేజీల మ్యానిఫెస్టోలో అన్ని అంశాలు పొందుపరిచారు. అందులో ప్రధానంగా నవరత్నాలు...నవరత్నాల హమీలన్నీ కూడా పూర్తిస్ధాయిలో అమలుచేశారు, కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల లేదా ఇతర ఇబ్బందులతో సంక్షేమ పథకాలు ఇవ్వని వారిలో అర్హులు ఉంటే వారికి కూడా ఇచ్చే కార్యక్రమం ఇది. గతంలో జన్మభూమి కమిటీ సభ్యులు అప్రూవ్‌ చేసిన వారికే ఇచ్చే పరిస్ధితి ఉండేది, పార్టీలు చూసేవారు, పార్టీలకు అతీతంగా మన సీఎంగారు పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హులైతే చాలు పథకాలు చేరాలన్న ఉద్దేశ్యంతో డీబీటీ క్రింద బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారులకే ఇస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా సోషల్‌ ఆడిట్‌ కూడా చేయిస్తూ పూర్తిస్ధాయిలో అర్హులందరికీ ఇస్తున్నాం. మన ప్రియతమ సీఎంగారు వెల్ఫేర్‌ క్యాలెండర్‌ చెప్పినట్లుగా చెప్పిన తేదీ రోజు మాట మేరకు ఆ రోజే ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పద్దతిలో కొనసాగుతుంది. ఈ రోజు విడుదల చేస్తున్న దాంట్లో ప్రధానంగా వైఎస్సార్‌ చేయూత, సున్నా వడ్డీ, వైఎస్సార్‌ ఆసరా ఈ మూడు పథకాల క్రింద ఎక్కువమంది లబ్ధిపొందుతున్నారు. గత ప్రభుత్వం ఎన్నికల హమీలు ఏం అమలుచేశారు అనేది ప్రజలు గమనించారు, కానీ సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ గారు మాట ఇస్తే అమలుచేస్తారని ప్రజలు భావించి రికార్డు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ప్రజల హృదయాలలో మరింత పదిలమైన స్ధానాన్ని సీఎంగారు ఏర్పాటుచేసుకున్నారు. అర్హులైన వారికి అన్ని పథకాలు అందాలంటే జిల్లా స్ధాయి అధికారులు మరింత సమర్ధవంతంగా పనిచేసి వారికి సద్వినియోగం అయ్యేలా అందరం పనిచేయాలి. అని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa