ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ నాయకత్వంలో మరో స్వాతంత్ర్య పోరాటం- శైలజానాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 28, 2021, 06:56 PM

దేశంలో మరో స్వాతంత్ర్యం కోసం  కాంగ్రెస్ నేత రాహుల్  గాంధీ నాయకత్వంలో మరోసారి పోరాటం  చేయాల్సి అవసరముందని ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకె  శైలజానాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశాన్ని రాజ్యాంగ, ప్రజల వ్యతిరేక శక్తులు పరిపాలిస్తున్నాయని, వీరి నుంచి  దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం రాహుల్ గాంధీ  నాయకత్వాన మరో స్వాతంత్ర్య పోరాటం అవసరం అని, కాంగ్రెస్ పార్టీ జెండా కింద కష్టపడతామని స్పష్టం చేశారు. మంగళవారం అనంతపురంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో శైలజానాథ్ ముఖ్య అతిధిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ అన్ని మూలాలను నాశనం చేస్తున్నాయని, దేశాన్ని అమ్మేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ చైర్మన్ దాదా గాంధీ, అనంతపురం జిల్లా కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి తో పటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa