ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో వారికి గుడ్ న్యూస్.. మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 09:18 AM

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ఉద్యోగులు డీఏ విషయంలో త్వరలోనే శుభవార్త వింటారని అన్నారు. ఏపీసీపీడీసీఎల్ ద్వితీయ వార్షికోత్సవం, విద్యుత్ సంస్థల నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పే రివిజన్ కమిటీతో జీతాలు తగ్గుతాయని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఉద్యోగాలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని వారికి న్యాయం జరిగేలా సానుకూల నిర్ణయం ఉంటుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa