ఏపీ ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత జీవీఎల్ నర్సంహా రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని అందుకు బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభ విజయవంతం కావడం నిదర్శనమని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన విజయవాడలో ప్రజాగ్రహ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి అంటే లెక్కలేనితనంగా ఉన్న పార్టీలకు నిన్నటి ప్రజా ఆగ్రహ సభ ఒక మేలుకొలుపు లాంటిదని, వైసీపీ పతనం ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీపై జాలిగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్న ఆయన, సజ్జల మాటల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభ ఆయా పార్టీలకు ఓరకంగా భయం కలిగిందని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. బీజేపీ నిర్వహించిన సభతో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి.. మీ పరిస్థితి గల్లంతని అర్థం చేసుకోండి అంటూ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. ఎవరో మాట్లాడిస్తే మాట్లాడాల్సిన దుస్థితి బీజేపీకి లేదని సజ్జల వ్యాఖ్యలపై చురకలంటించారు. అవినీతి తోలు తీసే పార్టీ ఒక్క బీజేపీ నేనని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బురదజల్లే కార్యక్రమాన్ని విరమించుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో తేటతెల్లమైందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa