ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థలం కాజేశారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 01, 2022, 01:49 PM

అనంతపురం: ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకు సంబంధించిన ఇంటి స్థలాన్ని ఓ వ్యక్తి స్వాధీనం చేసుకున్నాడని, దీంతో కలత చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు పుల్లయ్య తెలిపారు. పట్టణ పోలీసులు వివరాలు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa