ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒమిక్రాన్‌ టెన్షన్.. రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ

national |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 09:43 AM

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేద్రం మరో సారి లేఖలు రాసింది. తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు, ఐసోలేషన్ పడకలు, ఫీల్డ్ ఆసుపత్రులు, ఐసీయూ పడకలు, పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆక్సిజన్ లభ్యత, అంబులెన్స్‌లు, మందులు, మానవ వనరులు, టెలి-కన్సల్టేషన్‌ల ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఈ మేరకు కేద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa