అనంతపురం: అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి కల్పించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు నూతన వైస్సార్ పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు సంక్షేమఫలాలను అందించాలని మంత్రి సూచించారు. పెనుగొండ నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, సిబ్బందితో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరవేయాలన్నారు. అర్హులై ఉండి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందని లబ్ధిదారులను గుర్తించాలన్నారు.
నగర పంచాయతీ పరిధిలోని వార్డులలో అర్హులై ఉండి మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కల్పించాలని కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పుడు వెంటనేవాటిని పరిష్కరించాలన్నారు. నియమ నిబంధనల మేరకు ఏ ఏ పథకాల ద్వారా ఎవరెవరికి లబ్ధి కలుగుతుందో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమపథకాల వివరాలను ప్రతి ఒక్క కౌన్సిలర్ కి అందజేయాలన్నారు. అప్పుడే అందులోని పథకాలు, నియమ నిబంధనలు అవగాహన చేసుకొని ప్రజలకు మేలు చేసేందుకు కౌన్సిలర్లకు వీలు కలుగుతుందన్నారు.
ఈ సమావేశంలో పెనుకొండ నగర పంచాయతీ ఛైర్మన్ పి. ఉమర్ ఫరూక్, నగర పంచాయతీ కమిషనర్, వైస్ ఛైర్మన్ బోయ సునీల్, వైస్ ఛైర్మన్ నందిని రెడ్డి, కౌన్సిలర్లు, మొహమ్మద్ తొయ్యిబ్, సబినా యసీన్, సయ్యద ఫాజియా బాను, అంజలి, బోయ హరిత బాబు, నగరత్న గణేష్, లావణ్య కిరణ్, చంద్రకళ నర్సింహులు, సద్దాం హుస్సేన్, రఘునాథరెడ్డి, సుధాకర్ రెడ్డి, రామాంజి , సంజీవమ్మ మారుతి, భాస్కర్ నాయక్, వైశాలి జయశంకర్ రెడ్డి, ఫారీద్, నగర పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa