ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 02:12 PM

ధార్మిక పరిషత్‌ సభ్యుల సంఖ్య తగ్గిస్తూ తెచ్చిన చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 21 మంది సభ్యుల పరిషత్ ను నలుగురికి పరిమితం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్‌, దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి, అధికారులకు నోటీసులిచ్చింది. సభ్యుల సంఖ్యను తగ్గించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మరో వైపు సినిమా టికెట్‌ ధరల పిటిషన్‌పై హైకోర్టు విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa