ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై జేజే ఆస్పత్రిలో కరోనా కలకలం.. ఏకంగా 61 మంది డాక్టర్స్ కు పాజిటివ్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 05, 2022, 09:45 PM

భారత్ లో  కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ కూడా మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. అదే సమయంలో, కరోనావైరస్తో బాధపడుతున్న వైద్యుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే తాజాగా  ముంబైలోని జెజె హాస్పిటల్‌లో మొత్తం 61 మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయి ఐసోలేషన్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఓమిక్రాన్‌తో పాటు కరోనా కూడా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల 18,466 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 66,308కి చేరింది. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు 653కి పెరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa