అనంతపురం: నాలుగు రోజుల క్రితం లేపాక్షి పెద్దచెరువులో అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన మహిళా పోలీస్ సావిత్రి మృతికేను మరో మలుపు తిరిగింది. సచివాలయ ఉద్యోగుల వేదింపులవల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు లెటర్ రాసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి అక్క హ్యాండ్ బ్యాగ్ను పరిశీలించగా ఆ లెటర్ దొరికింది.
చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న సావిత్రి ఈనెల 4 న లేపాక్షి పెద్దచెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కడుపనొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతటితో ముగిసిందనుకున్నారు. అయితే అది మరో మలుపు తిరిగింది. సచివాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి తన ఫోన్ ట్రాప్డ్చేసి వేదింపులకు గురిచేస్తున్నాడని ఆ లెటర్ రాసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు ఇప్పుడు ఆమె రాసిన సూసైడ్ నోట్ కారణంగా ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. అత్మహత్యకేసు నమోదుచేయాలా, లేక అనారోగ్యంతో మృతిచెందినట్లు నమోదు చేసిన కేసు కంటిన్యూ చేయాలా అన్న విషయంపై పోలీసులు అలోచనలో పడ్డారు. ఇదిలా ఉంటే సావిత్రిరాసిన లెటర్ కావడంతో స్థానిక నచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఏ సమయంలో ఏ చర్యలు తీసుకుంటారో అన్న భయాం దోళనలు వ్యక్తం అవుతోంది దీనిపై ఎస్ఐ మునీర్అహ్మద్ ను వివరణ కోరగా టెర్ దొరికిందని కుటుంబ సభ్యులు మృతురాలి అక్క రమాదేవి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ లెటర్ ఆమె రాసిందా లేక ఇం కేమైనా జరిగిందా అని పూర్తీ నిర్ధారణ కోసం లెటర్ను నిర్ధారణ టీమ్కు పంపించాం. అక్కడి నుండి సమాచారం రాగానే కేసును వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షిస్తాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa