ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 11:25 AM

విశాఖపట్నం: వరుస ఇళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఆటో డ్రైవర్ ను క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం పోలీస్ కమిషనరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏడిసిపి డి ఎస్ శ్రావణ్ కుమార్ వివరాలు వెల్లడించారు.


గత ఏడాది డిసెంబర్ 28న పెందుర్తి పరిధిలోని నాయుడు తోట, అప్పలనరసయ్య కాలనీకి చెందిన మున్సి లియాకత్, పెందుర్తి క్రైం పోలీసులను ఆశ్రయించి, తన ఇంట్లో దొంగతనం జరిగినట్టు ఫిర్యాదు చేశారు. అదే నెల 27న కుటుంబ సభ్యులతో కలిసి సుజాత నగర్ లో నివాసం ఉంటున్న కుమారుని రిసెప్షన్ పార్టీకి వెళ్లి, తిరిగి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకున్నానని, ఇంటి వెనక తలుపులు పగలగొట్టబడి ఉండడంతో వెంటనే బీరువా చూడగా, అందులోని 8 తులాల బంగారం, రూ. 2, 30, 000ల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


దీంతో పశ్చిమ క్రైమ్ సిఐ బి లూధర్ బాబు నేతృత్వంలో క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా, రైల్వే న్యూ కాలనీ, శివాలయం వీధికి చెందిన పాత నేరస్తుడు అయిన ఆటో డ్రైవర్ షేక్ షాహిద్(32) ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఇతనిపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ సీట్ ఉంది. నాయుడు తోట చోరీతో పాటు, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట మూడు ఇళ్ల దొంగతనాలు, ఒకటి డే అఫెన్స్ చేసినట్టు క్రైమ్ పోలీసులు వెల్లడించారు. అలాగే కంచరపాలెం పరిధిలోని రైతు బజార్ ఎదురుగా గల గ్రామీణ బ్యాంకులో చోరికి యత్నించినటు వారు వెల్లడించారు. దీంతో నిందితుడు షేక్ షాహిద్ తో పాటు రిసీవర్స్ పి భరత్ కుమార్, బి కళావతి, ఎల్ కామేశ్వరిలను క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు నుండి 15 1/2 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 2, 45, 000ల నగదు, పల్సర్ మోటార్ వాహనం మొత్తంగా రూ. 6, 38, 500ల విలువగల చోరీ సొత్తును క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


నిందితుడు షేక్ షాహిద్, బాధితుడు మున్సి లియాకత్ కు బంధువు కావడం విశేషం. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన క్రైమ్ ఏసిపి సిహెచ్ పెంటారావు, క్రైమ్ సిఐలు బి లూధర్ బాబు, సిహెచ్ సింహాద్రి నాయుడు, ఎస్సైలు ఏం సుదర్శన్ రావు, డి కాంతారావు, ఎం రాధాకృష్ణ, ఎం గణపతిరావు, క్రైమ్ సిబ్బందిని ఈ సందర్భంగా ఏడిసిపి అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa