గోవాలో మళ్లీ పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి పార్టీ రెబల్స్ రూపంలో శాపం వెంటాడుతోంది. గోవా ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ రెబెల్స్ బెడద ను ఎదుర్కోనుంది. గోవా అసెంబ్లీ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసి మళ్లీ గోవాను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి, టికెట్ నిరాకరించడంతో పార్టీని వీడి వెళ్లిన నేతలు రెబెల్స్ గా ఎన్నికల బరిలోకి దిగడంతో తలనొప్పి మొదలైంది. ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీ చాలా ప్రాంతాల్లో అసమ్మతిని నియంత్రించగలిగింది. అయితే ప్రతిష్టాత్మకమైన పనాజీ నియోజకవర్గంతో సహా నాలుగు స్థానాలు మాత్రం బీజేపీకి ఆందోళన కలిగిస్తున్నాయి. పనాజీలో మాజీ ముఖ్యమంత్రి , దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 2019లో కాంగ్రెస్ను విడిచిపెట్టిన అధికార పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ నేతల పార్టీ ఫిరాయింపులలో కీలక భూమిక పోషించిన అటానాసియో మోన్సెరట్టెను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించటంతో ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఉత్పల్ పారికర్ తన హృదయం బిజెపితో కొనసాగుతుందని పేర్కొన్నాడు. అయితే అతను ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్నానని అందుకే ఎన్నికల బరిలోకి దిగుతున్నానని వెల్లడించారు. మాండ్రెమ్లో ఇండిపెండెంట్ గా మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ బరిలో దిగారు. సంగెంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్ భార్య సావిత్రి కవ్లేకర్ తిరుగుబాటు చేసి అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుభాష్ ఫాల్దేశాయ్పై పోటీ చేశారు. చంద్రకాంత్ కవ్లేకర్ బిజెపి అభ్యర్థిగా ఉన్న క్యూపెమ్ అసెంబ్లీ స్థానానికి సమీపంలో ఉన్న నియోజకవర్గం సంగేమ్. ప్రస్తుత సభలో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రసాద్ గాంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa