ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ హయాంలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 12:43 PM

చిత్తూరు: గత టీడీపీ హయాంలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను అందించడంలో మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్సీ దొరబాబు , పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని , రాష్ట్ర పార్టీ నాయకులు సురేంద్ర కుమార్ , రాష్ట్ర బిసి నాయకులు షణముగం , మాజీ మేయర్ నగర పార్టీ అధ్యక్షురాలు కటారి హేమలత లు పేర్కొన్నారు.


చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నగర మైనారిటీ సెల్ కార్యవర్గ సమావేశం అధ్యక్షులు అక్తర్ ప్రధాన కార్యదర్శి నవాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎఒక్క పథకం కూడా ఇవ్వడం లేదని , మైనారిటీలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజలను చైన్యవంతులను చేసి చంద్రబాబు తిరిగి మనం ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గచౌదరి, మోహన్ రాజ్, సుబ్రి, రియాజ్, జిలానీ, జాఫర్, గౌస్, మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa