కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖాళీల వివరాలను కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8,72,243 పోస్టులు ఖాళీగా ఉండగా, 2019 మార్చి 1నాటికి 9,10,153 పోస్టులు ఖాళీగా ఉండేవన్నారు. 2018 మార్చి 1 నాటికి ఈ సంఖ్య 6,83,823గా ఉండేదని లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ ద్వారా 2018-19, 2020-21 లో 2,65,468 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపారు. యూనియన్ గవర్నమెంట్ సర్వీసుల్లో 21,255 పోస్టులు ఖాళీగా ఉన్నాయని జితేంద్రసింగ్ తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహించే యూపీఎస్సీలో 485 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa