జమ్మూకశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. శనివారం శ్రీనగర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.శ్రీనగర్లోని (Srinagar) జకురా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ఎన్కౌంటర్ (Encounter) లో ఇద్దరు లష్కరే తోయిబా/ టీఆర్ఎఫ్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని ఇఖ్లాక్ హజామ్గా గుర్తించారు. ఇటీవల అనంత్నాగ్లోని హసన్పోరాలో హెడ్ కానిస్టేబుల్ అలీ మహమ్మద్ ఘనీని హతమార్చడంలో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు (JK) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. 2 పిస్టల్స్ సహా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజిపి తెలియపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa