ఏపీ ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక విధానాలు, అవినీతి, పరిపాలన వైఫల్యం కారణంగా ప్రభుత్వం దివాలా దిశగా పయనిస్తోందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షాత్తు గవర్నర్ను హామీగా పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే స్థాయికి దిగజారిపోయిందని విమర్శించారు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో మాట్లాడుతూ రవీంద్ర కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక విధానాలు, అవినీతి, పరిపాలన వైఫల్యం కారణంగా ప్రభుత్వం దివాలా దిశగా పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారని, కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ఏకంగా 3.5 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఇప్పటికీ ప్రతి రోజూ అప్పుల కోసం పాకులాడుతోందని అన్నారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు మద్యంపై వచ్చే 25 ఏళ్లలో రాబోయే ఆదాయాన్ని హామీగా చూపించి అప్పులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కనకమేడల మాట్లాడుతున్న సమయంలో సమయం ముగిసిపోవడంతో తిరిగి సోమవారం ప్రసంగాన్ని కొనసాగించే అవకాశం ఇవ్వనున్నట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa