ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైయస్ వివేకా హత్య కేసు... ఐదో నిందితుడిగా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 09:38 PM

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సి.బి.ఐ తన చార్జిషీట్లో మరో నిందితుడు పేరును చేర్చింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ నిన్న పులివెందుల కోర్టులో రెండో చార్జిషీటు దాఖలు చేసింది. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఇందులో ఐదో నిందితుడిగా చేర్చింది. గతేడాది నవంబరు 17న హైదరాబాద్‌లో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాతి రోజున పులివెందుల కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన కడప సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసులో సీబీఐ తాజాగా దాఖలు చేసినది రెండో చార్జ్‌షీట్ కాగా, తుది చార్జ్‌షీట్‌ను దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వివేకా డ్రైవర్ షేక్ దస్తగిరి ఆ తర్వాత అప్రూవర్‌గా మారి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనిచ్చిన సమాచారం ఆధారంగానే శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa