గోవాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ప్రతి నెల రూ.6వేల చొప్పున అందజేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అంటే ఒక్కో పేద కుటుంబానికి ఏడాదికి రూ.72 వేలు లబ్ధి చేకూరుతుందని వివరించారు. గోవాలో తమ పార్టీ అభ్యర్థుల తరపున కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోవాలో కాంగ్రెస్ అధికారం చేపట్టాల్సిన అవశ్యకతను ప్రజలకు వివరించారు. అన్ని వర్గాలకు సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. పేదల కోసం తాము చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలను ఈ సారి జరగకుండా చూసుకుంటామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము నియంతలకు టికెట్లు ఇవ్వడం లేదన్నారు. కొత్త వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మేజార్టీతో ఘన విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa