ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవంగం తెచ్చిన తంటా... ఏకంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది

national |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 11:54 PM

లవంగం ఓ మహిళ ప్రాణాలకే ముప్పు తెచ్చి పెట్టింది. మహిళ ఊపిరితిత్తుల్లో లవంగం ఇరుక్కుపోయింది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఆమెను వేధించాయి. తన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి, తగ్గించుకోవడానికి డాక్టర్లను కలిసినా ప్రయోజనం లేకపోయింది. సమస్య ఇంకా తీవ్రమవడంతో ఆమెకు క్యాన్సర్ ఉన్నట్టు డాక్టర్లు అనుమానించారు. అయితే అన్ని పరీక్షలు చేయగా అసలు విషయం తెలిసింది. లంగ్స్‌లో లవంగం ఉన్నట్టు తేలింది. మధ్యప్రదేశ్‌ ఇందోర్‌కు చెందిన 36 ఏళ్ల అనూష కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. బరువు తగ్గడంతో పాటు, తీవ్రమైన దగ్గు, ఉమ్మిలో రక్తం పడడం వంటి సమస్యలతో బాధపడింది. దానికోసం ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. ఎన్నో మందులు వాడింది. అయినా సమస్య తీరలేదు సరికదా.. ఎక్కువైంది. మూడు నెలలుగా విపరీతమైన దగ్గుతో ఇబ్బందిపడింది. పైగా ఉమ్మిలో రక్తం పడడం ఎక్కువైంది. దాంతో ఇది క్యాన్సరేనని ఓ డాక్టర్ చెప్పారు. అనేక పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ సంకేతాలు ఉన్నాయని తేల్చారు. అయితే మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో చికిత్స చేసిన వైద్యులు అది క్యాన్సర్ కాదని చెప్పారు. దాంతో మైక్రో స్కోపిక్ పరీక్ష ద్వారా ఆమె లంగ్స్‌లో లవంగం ఉందని గుర్తించారు. ఏడేళ్ల కిందట ఎప్పుడో తిన్న లవంగం ఊపిరితిత్తుత్లో ఇరుక్కుపోయింది. వైద్యులు చికిత్స చేసి దానిని బయటకు తీశారు. దాంతో ఆమె ప్రాణాలను నిలబెట్టారు. అయితే కోలుకున్న అనూష లవంగాలు తింటుంటే.. ఒకటి లోపల ఇరుక్కుపోయిందని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa