ఐసీఎస్ఈ, ఐఎస్ఈ 10, ప్లస్ టూ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఐసీఎస్ఈ టెన్త్, ఐఎస్ఈ ప్లస్ టూ ప్రథమ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు సీఐఎస్సీఈ పేర్కొంది. పరీక్షలు రాసిన విద్యార్థులంతా ఐసీఎస్ఈ, ఐఎస్సీల అధికారిక వెబ్సైట్ల నుంచి ఫలితాలను పొందొచ్చని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఎస్ఎమ్ఎస్ సేవల ద్వారా కూడా ఫలితాలు లభ్యమయ్యే సౌకర్యం ఉందని తెలిపారు. అంతేకాకుండా ఆయా పాఠశాలల ప్రిన్సిపల్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగించి కూడా ఫలితాల వివరాలను పొందొచ్చన్నారు. ఫలితాలో ప్రశ్నాపత్రాల రివాల్యువేషన్ కోరే విద్యార్థులు రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇందుకు ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మిగిలిన పరీక్షల లాగానే గతేడాది ఐసీఎస్ఈ, ఐఎస్సీ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ఫలితాలను వెల్లడించారు. ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా నమోదవుతుండడంతో పరీక్షలు నిర్వహించి, ఫలితాలను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa