ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు కరోనా పాజిటివ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 03:50 PM

కరోనా బారినపడిన రాజకీయ నేతల జాబితాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా చేరారు. గల్లా జయదేవ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. "ఎట్టకేలకు కరోనా నన్ను కూడా అంటుకుంది. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన రెండేళ్లకు నాకు కరోనా వచ్చింది. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్ అని వెల్లడైంది. వరుసగా రెండుసార్లు నెగెటివ్ వచ్చేంత వరకు ఐసోలేషన్ లోనే ఉంటాను" అని ట్వీట్ చేశారు. అంతేకాదు, ఇటీవల తనను కలిసిన వాళ్లందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గల్లా జయదేవ్ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa