ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పెయింటింగ్ ధర అక్షరాలా రూ.74 కోట్లు!

national |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 06:23 PM

గోడకు తగిలించుకునే పెయింటింగ్‌లు ఇంట్లో ఆహ్లాదం కోసం కొంటుంటాం. సామాన్యులైతే వందల్లో, కొంచెం స్థితిమంతులైతే వేలల్లో వెచ్చించి కొంటుంటారు. అత్యంత ధనవంతులైతే లక్షలు వెచ్చించడానికి కూడా వెనుకాడరు. ఊపిరి సినిమాలో నాగార్జున ఓ పెయింటింగ్‌ను రూ.20 లక్షలు పెట్టి కొనడం చూసి మరో హీరో కార్తీ నోరెళ్లబెడతాడు. అయితే తాజాగా లండన్‌లో ఓ సంస్థ అత్యంత సాధారణంగా ఉండే పెయింటింగ్‌ను వేలంలో కనీస ధర రూ.74 కోట్లకు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆ చిత్రం గురించి తెలుసుకుందాం.
16వ శతాబ్ధంలో జర్మన్ చిత్రకారుడు ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ ఓ చిత్రాన్ని గీశాడు. ఆయన తరువాత  మరణించారు. ఆ చిత్రం తరువాత చాలా మంది చేతులు మారి, లండన్‌లోని పుస్తకాల షాపు యజమాని వద్దకు చేరింది. 2017లో ఆయన దాని కోసం 30 డాలర్లు వెచ్చించాడు. కొంతకాలానికి పురాతన వస్తువులు సేకరించే ఓ వ్యక్తి ఆ షాపు వద్దకు వచ్చాడు. పెయింటింగ్‌ను చూసి, అది చాలా ఏళ్ల క్రితంనాటిదని గుర్తించాడు. ఆ షాపు యజమాని కోరినంత ఇచ్చి, దానిని సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రం వివరాలు తెలుసుకునేందుకు ఆ వ్యక్తి 10 దేశాలను చుట్టేశాడు. చివరకు అది జర్మన్‌లో ఆల్బ్రెచ్ట్ గీసిందని నిర్ధారించుకున్నాడు.

అత్యంత సాదాసీదాగా, పెన్సిల్‌తో గీసిన పెయింటింగ్ అది. అందులో చంటిపిల్లను చేతిలో పెట్టుకున్న మహిళ కనిపిస్తుంది. దీనికి ‘ద వర్జిన్ అండ్ చైల్డ్’ అని నామకరణం చేశారు. దీనిని లండన్‌లో పురాతన వస్తువులు వేలం వేసే సంస్థ ఇటీవల వేలానికి పెట్టింది. కనీస ధరనే రూ.74 పెట్టడంతో ప్రపంచమంతా ఆసక్తిగా దీనిని గురించి తెలుసుకోసాగారు. అంతకు మించే ధర పలుకుతుందని ఆ సంస్థ ధీమాగా ఉంది. అంత ధర పెట్టి, సొంతం చేసుకునే వ్యక్తి ఎవరో వేలం ముగిసిన తర్వాత తెలియనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa