ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేటు బస్సులో రూ. 17 లక్షల చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 01:08 PM

ఓ ప్రైవేటు బస్సులో రూ 17 లక్షలను చోరీ చేశారు. గంగవరం రూరల్ సీఐ రామ కృష్ణ చారి, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా, నరసరావుపేట కు చెందిన ఓ వ్యాపారి వద్ద ఆది బాబు పనిచేస్తున్నారు. బెంగుళూరులో ఎండుకొబ్బరి కొనుగోలు నిమిత్తం ఆదివారం రాత్రి రూ. 17 లక్షలు తీసుకొని ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. నగదును ఓ బ్యాగులు పెట్టుకున్నాడు. దాన్ని లగేజ్ క్యారియర్ లో పెట్టి ప్రయాణం సాగించాడు.

సోమవారం ఉదయం బంగారుపాలెం మండలం లోని నలగాంపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న నందిని ఫుడ్ ప్లాజా వద్ద బస్సు ఆగింది. అల్పాహారం కోసం ఆదిబాబు బస్సు దిగి హోటల్ కు వెళ్ళాడు. తిరిగి వచ్చే సరికి నగదు ఉంచిన బ్యాగు కనిపించలేదు. దాంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎస్సై తన సిబ్బందితో వెళ్లి హోటల్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బస్సు బయల్దేరాక ముందు కర్ణాటకకు చెందిన ఓ కారులో నలుగురు వ్యక్తులు బ్యాగ్ తో వెళుతున్నట్టు గుర్తించారు. వెంటనే జాతీయ రహదారిపై ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa