భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలతలు మన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు పలు ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. ఇది కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 657 పాయింట్లు లాభపడి 58,466 వద్ద ముగిసింది. నిఫ్టీ 197 పాయింట్లు లాభపడి 17,463 వద్ద స్థిరపడింది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
మారుతీ సుజుకి (4.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.02%), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (2.50%), బజాజ్ ఫిన్సర్వ్ (1.77%) మరియు టైటాన్ (1.72%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-0.72%), ITC (-0.50%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.38%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa