తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. ఈ నేపధ్యంలో శ్రీవారి సంపన్న భక్తుల కోసం టీటీడీ శ్రీవారి ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు పొందేందుకు సరికొత్త ప్రణాళిక ను రూపొందించింది. ఈ నేపధ్యంలో టీటీడీ వెబ్సైట్ కొత్త అప్లికేషన్ తీసుకొస్తుంది. ఈ నెల 16వ తేదీన టీటీడీ వెబ్ సైట్ లో అప్లికేషన్ విడుదల చేయనుంది. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు విరాళమిచ్చిన దాతలకు ప్రివిలైజ్ గా ఉదయాస్తమాన టికెట్ ను టీటీడీ కేటాయించనుంది. ప్రానదాన ట్రస్టుకు ఎవరైనా భక్తులు రూ.1.5 కోటి విరాళమిస్తే శుక్రవారం.. రూ.1 కోటి విరాళమిస్తే మిగిలిన రోజుల్లో ఉదయాస్తమాన సేవా భాగ్యం కల్పించనుంది. అయితే శుక్రవారాల్లో కేవలం 28 ఉదయస్తమాన సేవా టికెట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక మిగిలిన రోజుల్లో 503 టికెట్లు ఖాళీగా ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆసక్తి గాస్ల భక్తులు ఈ ఉదయస్తమాన సేవలను ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఆఫ్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో రూ.5 లక్షలు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలని టీటీడీ ప్రకటించింది. అయితే ఆఫ్ లైన్ ద్వారా మిగిలిన మొత్తం చెల్లించని పక్షంలో అడ్వాన్స్ గా కట్టిన రూ.5 లక్షలు రీఫండ్ చేయమని తెలిపింది. అంతేకాదు ఒక మనిషికి ఒక టికెట్ మాత్రమే కేటాయిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా విరాళమిచ్చిన భక్తులకు 25 ఏళ్లు పాటు సంవత్సరంలో ఒక రోజు దాతతో కలిపి ఆరు గురికి ఉదయస్తమాన సేవను కల్పించనుండి. అదే ఏవైనా కంపెనీలు అయితే 20 ఏళ్ల పాటూ ఉదయస్తమాన సేవను కల్పించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa