ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన బ్రిటానియా

business |  Suryaa Desk  | Published : Fri, May 08, 2026, 11:47 AM

బ్రిటానియా ఇండస్ట్రీస్ తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పిండి, కోకో, పామ్ ఆయిల్ వంటి ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కాగా, కంపెనీ ప్రకటన అనంతరం స్టాక్ మార్కెట్‌లో బ్రిటానియా షేర్లు తీవ్ర ఒత్తిడికి గురై, ఒక దశలో 5 శాతం వరకు క్షీణించాయి. ముడి పదార్థాల వ్యయభారం కారణంగా ఎఫ్‌ఎంసీజీ రంగంలో ధరల పెంపు ఒత్తిడి మరింత పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa