సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టర్మ్ 2 పరీక్షలను ఏప్రిల్ 26 నుండి నిర్వహించనున్నట్టు 'సీబీఎస్ఇ' అధికారికంగా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 'సీబీఎస్ఇ' పరీక్షపై నీలినిడాలు కమ్ముకున్నాయి. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టర్మ్-2 పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే పరీక్షలను ఆఫ్ లైన్ లోనే ఈ పరీక్షలను నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. ఇటీవల టర్మ్-1 పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ పరీక్షల ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఈ ఫలితాల ముందే టర్మ్ -2 పరీక్షలు నిర్వహించనుంది. అలాగే ఈ పరీక్షకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెబ్ సైట్ లో ఉంచనుంది. అలాగే పదో తరగతి, 12వ తరగతి పరీక్ష తేదీలు 'సీబీఎస్ఇ' యొక్క అధికారిక వెబ్సైట్ cbseresults.nic.in లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే విద్యార్థులకు గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రాలే ఉంటాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa