ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2017, 08:01 PM

జైపూర్: త్వరలో జరుగునున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందస్తు వ్యూహరచన చేస్తున్న బీజేపీకి తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్‌లోని పంచాయతీ ఉపఎన్నికల్లో బీజేపీ కుదేలైంది. ఇటీవల జరిగిన ఈ ఉపఎన్నికల్లో 26 స్థానాలకు గాను బీజేపీ కేవలం 12 స్థానాలే గెలుచుకుంది. కాంగ్రెస్ సైతం పోటాపోటీగా 12 స్థానాలు గెలుచుకోగా, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. మరో సీటు ఫలితం వెల్లడికావాల్సి ఉంది. ఆసక్తికరంగా చారిత్రాత్మకంగా బీజేపీకి కంచుకోటైన ప్రాంతాల్లోనే ఈ ఉపఎన్నికలు జరిగాయి. అయితే నిరాశజనకంగా ఫలితాలు రావడం ముఖ్యమంత్రి వసుంధరా రాజేను ఇరకాటంలో పడేసిందని అంటున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో తమ పార్టీ సాధించిన విజయంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో తాము నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన గ్రామీణ ప్రజల్లో బలంగా ఉందన్నారు. రైతులపై ఏమాత్రం కనికరం లేకుండా ప్రభుత్వం వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల కేసులు 20 వరకూ నమోదయ్యాయని చెప్పారు. 2018లో రాజే పదవీకాలం ముగియడానికి ముందే ప్రజలు బీజేపీపై విశ్వాసాన్ని కోల్పోయారనడానికి తాజా ఫలితాలే నిదర్శనమని పైలట్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa