ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ‌లో రేపటి నుంచి నో హెల్మెట్.. నో పెట్రోల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2017, 08:27 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్‌‌ని కఠినతరం చేస్తూ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికారులతో బుధవారం అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డు ప్రమాదాల నివారణకి కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను నడిపేవారు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని.. అలా ధరించని వారి బండిలోకి పెట్రోల్‌ నింపొద్దని బంక్‌ యజమానుల్ని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.


ఈ కొత్త రూల్స్‌ గురువారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేలా చూడాలని అధికారులకి సూచించారు. వారానికి ఒకసారి క్రమం తప్పకుండా అధికారులు ఈ రూల్స్‌ అమలుపై తనిఖీలు నిర్వహించాలన్నారు. నో హెల్మెట్.. నో పెట్రోల్‌‌పై అందరికీ అవగాహన కల్పించి.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa