భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ అనూహ్యంగా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. బోర్డులో క్రికెట్ వ్యవహారాలకి సంబంధించిన శాఖకి జీఎంగా ఉన్న ఆయనపై గత కొంతకాలంగా విరుద్ధ ప్రయోజనాల (కాన్ప్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీకి శ్రీధర్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో అతను తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అతని రాజీనామాని పాలకుల కమిటీ ఈ రోజే ఆమోదించేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కి గతంలో సెక్రటరీగా పనిచేసిన శ్రీధర్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ బోర్డు జనరల్ మేనేజర్గా అప్పట్లో నియమించారు. కానీ.. ఇప్పటికీ హెచ్సీఏతో శ్రీధర్కి ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయని ఏడాది కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరణని బీసీసీఐ పాలకుల కమిటీకి అతను ఇచ్చేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో శ్రీధర్పై కమిటీ చర్యలు తీసుకుని పదవి నుంచి తప్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa