ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ-ఝాన్సీ దంపతుల కుమారుడు లక్ష్మీనారాయణ్ సందీప్-పూజితల వివాహం హైదరాబాద్లో శుక్రవారం వైభవంగా జరిగింది. హెచ్ఐసీసీలో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి-భారతి దంపతులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. అతిథులను ఆప్యాయంగా పలకరించి, కాసేపు వివాహ వేడుకలో గడిపారు. అనంతరం హైదరాబాద్లోని తమ నివాసం లోటస్ పాండ్కు పయనమయ్యారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు తిరిగి బయల్దేరనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa