ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ కరెన్సీ లాంచ్ చేసే టైమ్‌లైన్‌ నో కామెంట్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 06:01 PM

డిజిటల్ కరెన్సీని లాంచ్ చేసే టైమ్‌లైన్‌ను వెల్లడించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నిరాకరించారు. డిజిటల్ రూపాయిని హడావుడి హడావుడిగా లాంచ్ చేయమని శక్తికాంత్ దాస్ తెలిపారు. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీపై పనిచేయడం ప్రారంభించామని, సైబర్ దాడులకు వ్యతిరేకంగా పలు టెక్నాలజీలను, మెకానిజాలను రూపొందించేందుకు ఆర్‌బీఐ చూస్తున్నట్టు దాస్ చెప్పారు. అంతేకాక డిజిటల్ రూపాయి ఎలా ఉండబోతుందో కూడా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ వివరించారు. డిజిటల్ రూపాయి అచ్చంగా నార్మల్ ఫిజికల్ రూపాయి మాదిరిగానే ఉండనుందని రవి శంకర్ తెలిపారు. కానీ సాధారణ కరెన్సీకి, దీనికి ఒకటే తేడా అని.. అది డిజిటల్ రూపంలో ఉంటుందని చెప్పారు. నార్మల్ రూపాయిని మీరు జేబులో లేదా పాకెట్‌లో పెట్టుకుంటే, డిజిటల్ రూపాయిని సెల్ ఫోన్‌లో భద్రపరుచుకోవచ్చని పేర్కొన్నారు. డిజిటల్ రూపాయికి, ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు మధ్యనున్న తేడాను కూడా వివరించారు. డిజిటల్ రూపాయిని ఆర్‌బీఐ జారీ చేస్తుందని వెల్లడించారు. అయితే క్రిప్టో కరెన్సీలు మన దేశ స్థూల ఆర్థిక స్థిరత్వానికి పెను ప్రమాదంగా ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు పలు సూచనలు చేశారు. సొంతంగా ప్రమాదంలో పడుతున్నామన్న విషయాన్ని గుర్తుంచుకుని ఈ కరెన్సీలలో పెట్టుబడులు పెట్టాలని అన్నారు. ఇదిలావుంటే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. ఎంతో కాలంగా వేచిచూస్తోన్న డిజిటల్ కరెన్సీ లాంచ్‌పై కేంద్ర ప్రభుత్వం చేసిన తొలి ప్రకటన ఇదే. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ, మన డిజిటల్ ఎకానమీకి బూస్టప్ ఇస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa