ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఆధాయంపై పన్ను వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది

national |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 01:35 AM

క్రిప్టో కరెన్సీ లావాదేవీల రూపంలో వచ్చే లాభాలపై పన్ను వేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలపై పన్ను విధించినందున దీని చట్టబద్ధతపై మంత్రికి సభ్యుల నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. పన్ను విధించినంత మాత్రాన ప్రభుత్వం చట్టబద్ధం చేస్తుందనుకోవద్దని చెప్పారు. ‘‘ఈ దశలో క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధం చేయడం లేదు. అలాగని నిషేధించడమూ లేదు. సంప్రదింపుల తర్వాత నిషేధించడమా? లేక నిషేధించకపోవడమా? అన్నది తేలుతుందన్నారు. క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై వచ్చే లాభం నుంచి 30 శాతం పన్ను చెల్లించాలని కేంద్ర బడ్జెట్ 2022-23లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదన చేర్చడం తెలిసిందే. క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఉంటుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటికి ఎటువంటి అంతర్గత విలువ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తాజాగా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa