చంద్రగిరి మండల పరిధి పాకాలవారి పల్లి పూతలపట్టు నాయుడుపేట జాతీయ హైవే రహదారి టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, తమిళనాడు ఆర్టీసీ బస్సులో ఎర్రచందనం స్మగ్లర్లు 36 మంది పారిపోయారు. తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్ ఇస్మాయిల్ వయసు(46), కండక్టర్ జయశంకర్ వయసు (46), కండక్టర్ గోవింద స్వామి వయసు (45), మెకానికల్ గుణశేఖరన్ వయసు(46) పట్టుకుని విచారించగా గుణశేఖరన్ ఎర్ర స్మగ్లర్లను రవాణా చేసే కీలక వ్యక్తి అని సీఐ బీవీ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడులోని తిరుపత్తూర్ చెందిన దామోదర్, దగ్గరనుంచి రూ"400/-లు గుణశేఖర్ తీసుకుని, తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ కు డబ్బులు పంచి, బస్సులో తమిళ ఎర్రచందనం స్మగ్లర్లను పంపించడం జరుగుతుందని తెలిపారు. తమిళనాడు ఆర్. టి. సి బస్సులో 28 స్కూల్ బ్యాగ్స్ లు, 3 కట్టెల బ్యాగులు, 8 ప్లాస్టిక్ బ్యాగులు స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు హిమబిందు, విజయ కుమార్ నాయక్, పోలీసులు అమరనాథ్ రెడ్డి, అయ్యప్ప, గోపి, మోహన్, రైటర్ సుధాకర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa