ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 17న చర్చించేందుకు రావాలని కేంద్ర హోం శాఖ నుంచి సీఎస్లకు లేఖ వచ్చింది. ఇందులో ప్రధానంగా 9 అంశాలపై చర్చ జరగనుంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ - తెలంగాణ మధ్య విద్యుత్ పంపిణీ, రెండు రాష్ట్రాల మధ్య పన్ను బకాయిలు, బ్యాంకు డిపాజిట్ల చెల్లింపులు, విద్యుత్ సంస్థల మధ్య వివాదం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు, రిసోర్సెస్ గ్యాప్, ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. దీంతో విభజన అంశాలు ఓ కొలిక్కి రానున్నాయని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కీలకంగా మారనుంది. రెండు రాష్ట్రాలకు విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎస్లు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇటీవల ఏపీ విభజన సరిగ్గా చేయలేదని ప్రధాని మోడీ పార్లమెంట్లో వ్యాఖ్యానించడంతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. దీంతో విభజన హామీలను పరిష్కరిస్తామని కేంద్రం చెప్పడం శుభపరిణామమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa